హైదరాబాద్: రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ (Minister KTR) అమెరికా పర్యటన కొనసాగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పారిశ్రామిక విధానం, అందిస్తున్న ప్రోత్సాహంతో ఇప్పటికే ప్రపంచ దిగ్గజ కంపెనీలు రాష్ట్రానికి క్యూకడుతున్నాయి. తాజాగా ఫ్రెంచ్-అమెరికన్ ఆయిల్ అండ్ గ్యాస్ దిగ్గజం అయిన టెక్నిప్ ఎఫ్ఎంసీ (TechnipFMC) రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. సాఫ్ట్వేర్ గ్లోబల్ డెలివరీ సెంటర్ అండ్ ప్రెసిషన్ ఇంజినీరింగ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి హైదరాబాద్ను (Hyderabad) కేంద్రంగా ఎంచుకున్నది. రూ.1250 కోట్లతో నగరంలో కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది.
దీని ద్వారా ఇంజినీరింగ్ విభాగంలో 2500 ఉద్యోగాలు, తయారీ రంగంలో మరో వెయ్యి ఉద్యోగాలు రానున్నాయి. మొత్తంగా మరో 3500 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. టెక్నిప్ ఎఫ్ఎంసీ నిర్ణయం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. దీనివల్ల హైదరాబాద్కు అదిపెద్ద ప్రోత్సాహం లభించినట్లయిందని, నగర సామర్థ్యానికి నిదర్శనంగా నిలిచిందన్నారు.
Delighted to announce that @TechnipFMC, a French American Oil and Gas giant selects Hyderabad as a key hub for their software Global Delivery Center & Precision Engineering Manufacturing Facility, creating 2,500 jobs in engineering and 1,000 jobs in the manufacturing facility… pic.twitter.com/G9L6EgVwHf
— KTR (@KTRBRS) May 20, 2023