మహబూబాబాద్ : సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న కోణార్క్ ఎక్స్ప్రెస్లో సాంకేతిక లోపం తలెత్తింది. ఏసీ బోగీ(బీ2)లో పొగలు రావడాన్ని గమనించిన ప్రయాణికులు అప్రమత్తమై.. రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రైలును డోర్నకల్ రైల్వేస్టేషన్లో నిలిపివేశారు. ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కోణార్క్ ఎక్స్ప్రెస్ నిలిపివేత కారణంగా పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.