నల్లగొండ : ఉపాధ్యాయ వృత్తికి ఎనలేని గౌరవం ఉందని, సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించి మంత్రి మాట్లాడారు.
సమాజ మార్పు కోసం పరితపించే వారు ఉపాధ్యాయులు అన్నారు.
విద్యార్థుల్లో వుండే నైపుణ్యాలను వెలికితీసి వారిని ఉన్నతులుగా తీర్చి దిద్దే వాళ్లు ఉపాధ్యాయులు అన్నారు. వృత్తికి అంకితమై పని చేసే వారే నిజమైన ఉపాధ్యాయులు అన్నారు.
కార్యక్రమంలో గాదరి కిషోర్ కుమార్, భూపాల్ రెడ్డి, రవీంద్ర కుమార్,జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేగట్టే మల్లికార్జున్ రెడ్డి, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, డీఈవో భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.