హైదరాబాద్, ఏప్రిల్ 4 : ఉపాధ్యాయులకు యాజమాన్యాల వారీగా, కొత్త జిల్లాల సీనియార్టీ ప్రాతిపదికన పదోన్నతులు, సాధారణ బదిలీలు వేసవి సెలవుల్లో చేపట్టాలని పీఆర్టీయూటీఎస్ ప్రభుత్వాన్ని కోరింది. సోమవారం సచివాలయంలో సీఎస్ సోమేశ్కుమార్, విద్యాశాఖకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియాకు వినతిపత్రాన్ని అందజేసింది.
ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్రెడ్డి, పీఆర్టీయూటీఎస్ అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్రావు సీఎస్తో భేటీ అయ్యారు. ఉపాధ్యాయ పరస్పర బదిలీల ఉత్తర్వులు జారీచేయాలని, పండిట్, పీఈటీల అప్గ్రెడేషన్, ప్రతి మండలానికి ఎంఈవో ఉండేలా చూడాలని కోరారు.