TDP | బంజారాహిల్స్, అక్టోబర్ 29: తెలంగాణలో పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయించింది. చంద్రబాబుతో మాట్లాడిన అనంతరం లోకేశ్ ఈ నిర్ణయాన్ని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఙానేశ్వర్ ముదిరాజ్కు తెలియజేశారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీటీడీపీ తరపున పోటీ చేయాలనుకున్న పలువురు నేత లు, వారి అనుచరులు బంజారాహిల్స్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్దకు చేరుకొ ని ఆందోళనకు దిగారు.
ఏడాది కాలంగా లక్షలు ఖర్చు చేస్తూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, తీరా ఎన్నికల సమయంలో తమను నట్టేట ముంచారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే లోకేశ్ వచ్చి తమకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూ.. తెలంగాణలో పోటీ చేయాల్సిందేనని తాను పార్టీ అధిష్ఠానానికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా విముఖత చూపారని అన్నారు.