హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య సీట్ల పంపకం ఖరారైంది. వచ్చే ఎన్నికల్లో జనసేన 24 అసెంబ్లీ, మూడు లోక్సభ సీట్లలో పోటీచేయనుండగా.. మిగిలిన స్థానాల్లో తెలుగుదేశం పార్టీ బరిలోకి దిగనుంది. ఈ మేరకు ఉభయ పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్కల్యాణ్ మధ్య అవగాహన కుదిరింది.