మే/జూన్ నెలలో నిర్వహించనున్న ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షా ఫీజు చెల్లించేందుకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టీఓఎస్ఎస్) శనివారం తత్కాల్ స్కీంను ప్రకటించింది. 2021-22 విద్యా సంవత్సరంలో తెలంగాణ ఓపెన్ స్కూల్ కోర్సులో ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్ అడ్మిషన్లు పొందిన అభ్యర్థులు, అంతకుముందు ఫెయిల్ అయిన అభ్యర్థులు, పరీక్షలకు హాజరయ్యేందుకు అర్హులైనప్పటికీ పరీక్ష రుసుం సకాలంలో చెల్లించలేని అభ్యర్థులు ఇప్పుడు మే 1 నుంచి 7 వరకు చెల్లించవచ్చు.
తత్కాల్ స్కీం కింద సాధారణ ఫీజుకు అదనంగా ఎస్సెస్సీకి రూ. 500, ఇంటర్మీడియెట్కు రూ. వెయ్యి చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు తమ సంబంధిత స్టడీ సెంటర్ కో ఆర్డినేటర్ను సంప్రదించవచ్చు.