హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): సర్కారు బడుల్లోని విద్యార్థులు కనీస సామర్థ్యాల సాధనకు చేపట్టిన ‘తొలిమెట్టు’ కార్యక్రమం పర్యవేక్షణకు జిల్లా అకడమిక్ టాస్క్ఫోర్స్ (డీఏటీఎఫ్)లను ఏర్పాటు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన బుధవారం ఉత్తర్వులిచ్చారు.
జిల్లాస్థాయిలో ప్రణాళికల రూప కల్పన, అమలు, నిర్వహణ, సాంకేతిక సహకారం, పర్యవేక్షణకు ఈ టాస్క్ఫోర్స్ పనిచేస్తుందని పేర్కొన్నారు. 1 నుంచి 5వ తరగతుల విద్యార్థులు కనీస సామర్థ్యాల సాధనకు జాతీయ స్థాయిలో ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు.