హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్లో ఉన్న రాడిసన్ న్ బ్లూ (Radisson blu pub) హోటల్పై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. హోటల్లో భాగంగా ఉన్న ఫుడింగ్ మింగ్ పబ్లో పార్టీ జరుగుతున్నదని, అందులో పాల్గొన్న పలువురు డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు పబ్పై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడిచేశారు. పబ్ను సమయానికి మించి నడుపుతున్నట్లు గుర్తించారు.
దీంతో యజమానులతో సహా సుమారు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారందరిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే మత్తులో ఉన్న యువకులు ఠానాలో హంగామా చేశారు. తమను ఎందుకు తీసుకువచ్చారని ఆందోళనకు దిగారు. కాగా, పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో 39 మంది యవతులు, ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉన్నారు. నిర్వాహకులపై కేసు నమోదుచేసిన పోలీసులు.. హోటల్ సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు.