రాయపర్తి, మార్చి 8 : పంటలను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఎండలు ముదిరి, భూగర్భ జలాలు అడుగంటినా ప్రభుత్వం సాగునీటిని అందించకపోవడంతో వీటికి తోడు అడపాదడపా కరెంట్ కోతలతో పొట్ట దశలో ఉన్న పంటను కాపాడుకునేందుకు రైతులు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తిర్మలాయపల్లి శివారులోని సపావత్ తండాకు చెందిన భూక్యా భోజ్యా తాను సాగు చేసిన వరి పంటకు ట్యాంకర్తో నీళ్లు పారిస్తున్న దృశ్యాలు అన్నదాతల ఇబ్బందులకు అద్దం పడుతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి సాగునీటిని అందించాలని రైతులు కోరుతున్నారు.