తాండూరు, మార్చి 14: ఢిల్లీలో ఈనెల 14 నుంచి 18 వరకు జరుగుతున్న అంతర్జాతీయ ఆహార ఉత్పత్తుల ప్రదర్శనలో భౌగోళిక గుర్తింపు పొందిన తాండూరు కందిపప్పునకు స్థానం లభించింది. ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు గుర్రాల శ్రీనివాస్రెడ్డి, షేర్ ఎన్జీవో వ్యవస్థాపకుడు మరాఠి నర్సింలు ఈ పప్పును ప్రదర్శనకు ఉంచా రు.
తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో తయారు చేసిన ఆర్గానిక్ కందిపప్పును ఢిల్లీ ప్రదర్శనలో ఉంచడంతో అనేకమంది ఆసక్తిగా తెలుసుకుంటున్నారని వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్తలు సుధారాణి, సుధాకర్ పేర్కొన్నారు. తెలంగాణ నుంచి ఈ ఒక్క ఉత్పత్తి మాత్రమే ప్రదర్శనలో ఉండటం గమనార్హం.