Tammineni | వ్యాపారులు ఎంపీలు, ఎమ్మెల్యేలవుతున్నారని.. దీన్ని సీపీఎం ఖండిస్తుందని ఆ పార్టీ నేత తమ్మినేని వీరభద్రం అన్నారు. భువనగిరి పట్టణంలో సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం మీడియా సమావేశం
నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ గతంలో చేసిన వాగ్ధాలను అమలు చేయడం లేదన్నారు. మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు. బీజేపీ 8వేలకోట్లు, కాంగ్రెస్కు 2వేల కోట్లు విరాళాలు వచ్చాయన్నారు.
ఎలక్టోరల్ బాండ్లను సీపీఎం వ్యతిరేకించిందన్నారు. కోర్టు కేసుల్లో ఇంప్లీడ్ అయ్యామన్నారు. పార్టీ మార్పు అనేది సాధారణమైందని.. అధికారంలో నుంచి పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్తే.. నాయకులు పార్టీలను వీడుతున్నారన్నారు. అధికారం లేకపోతే పార్టీ ఖాళీ అవుతుందన్నారు. భువనగిరి సీపీఎం అభ్యర్థి జహంగీర్ను గెలిపించాలని కోరారు. తనను అభ్యర్థిగా ఎంపిక చేసిన నేతలకు జహంగీర్ ధన్యవాదాలు తె లిపారు. సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నానని.. చేసిన పోరాటాలు వృథా కాలేదన్నారు.
ఆర్థికంగా కొంత పార్టీ వెనుకబడిందని.. ప్రజలు అందరు కలిసి విరాళాలు వేసుకొని సర్పంచ్గా గెలిపించారన్నారు. ప్రశ్నించే వారిని గెలిపించాలని సీపీఎం పార్టీ విజ్ఞప్తి చేస్తుందన్నారు. జూలకంటి రంగారావు ధన బలానికి, నిజాయితీగా పని చేస్తున్న ఎన్నికలుగా భువనగిరి ఎంపీ ఎన్నికలుగా చూడాలన్నారు. పార్టీల ఫిరాయించే వారికి బుద్ధి చెప్పాలన్నారు. చెరువుల్లో నీటి చుక్క లేదని.. సాగు, తాగు నీటికి ప్రస్తుతం ఇబ్బందిగా ఉందన్నారు. రైతుబంధు రాలేదని.. రైతులను ఆదుకోవాలన్నారు. కూలీల వలసలను ఆపాలని విజ్ఞప్తి చేశారు.