హైదరాబాద్ : 44వ అంతర్జాతీయ చెస్ ఒలింపియాడ్ పోటీలను ప్రారంభించేందుకు రావాలని తమిళనాడు సీఎం స్టాలిన్.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో డీఎంకే ఎంపీ గిరి రాజన్ శుక్రవారం ప్రగతి భవన్కు వచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు శాలువా కప్పి, జ్ఞాపికను బహుకరించారు. అనంతరం స్టాలిన్ రాసిన ఆహ్వాన లేఖను కేసీఆర్కు ఎంపీ గిరి రాజన్ అందజేశారు.
ఈ నెల 28 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు తమిళనాడు రాజధాని చెన్నై వేదికగా చెస్ ఒలింపియాడ్ పోటీలు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో 28న చెస్ పోటీలను ప్రారంభించేందుకు రావాలని సీఎం కేసీఆర్ను స్టాలిన్ కోరారు. కాగా 188 దేశాల నుంచి చెస్ క్రీడాకారులు పాల్గొంటున్న ఈ పోటీలు, భారత దేశంలో మొదటిసారిగా, ఆసియాలో మూడోసారి జరుగుతున్నప్రతిష్టాత్మక పోటీలని లేఖలో సీఎం స్టాలిన్ పేర్కొన్నారు.