SCR | హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): రైళ్లు కదులుతున్న సమయంలో సెల్ఫోన్ మాట్లాడుతూ ఎకడం, దిగడం, పట్టాలు దాటడం వంటి చర్యలు చట్టరీత్యా నేరమని సౌత్ సెంట్రల్ రైల్వే హెచ్చరించింది. రైల్వేట్రాక్లు, పరిసరాల్లో సెల్ఫీలు, ఫొటోలు తీసుకోవడం, కదులుతున్న రైళ్లపై ఎక్కి రీల్స్ చేయడంతో ప్రాణహాని పొంచి ఉన్నదని రైల్వే అధికారులు ఓ ప్రకటనలో అధికారులు పేర్కొన్నారు. భారతీయ రైల్వే చట్టం-1989లోని సెక్షన్ 147 ప్రకారం రైల్వేట్రాక్ను దాటడం నేరమని పేర్కొన్నారు.