హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): చలి కాలం నేపథ్యంలో బస్సు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండి, ప్రమాదాలను నివారించాలని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు. దట్టంగా పొగ మంచు కురుస్తున్న సమయంలో డ్రైవర్లు చాకచక్యంగా వ్యవహరించాలని సూచించారు. జాతీయ స్థాయిలో అతి తక్కువ ప్రమాద రేటులో టీఎస్ఆర్టీసీ అనేక అవార్డులు అందుకున్నదని, అదేవిధంగా ప్రమాదాలు జరగకుండా భవిష్యత్తులోనూ అవార్డులు పొందే విధంగా డ్రైవర్లు పనిచేయాలని పేర్కొన్నారు. జాతీయ, అటవీ రహదారులు, నగర శివారు ప్రాంతాల్లో వేగ నియంత్రణ పాటించాలని సూచించారు.