చివరి ఆయకట్టుకూ నీరందేలా చూడాలి : మంత్రి అల్లోల
హైదరాబాద్లో ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులపై ఎమ్మెల్యేలు, జడ్పీ అధ్యక్షులు, అధికారులతో సమీక్ష
ఆదిలాబాద్, మార్చి 26 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టుల నిర్మాణాల్లో వేగం పెంచాలని రాష్ట్ర అటవీ పర్యావరణశాఖ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శుక్రవారం హైదరాబాద్లో ఎమ్మెల్యేలు, జడ్పీ అధ్యక్షులు, నీటి పారుదల శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల ప్రగతిపై సమగ్రంగా చర్చించారు. చివరి ఆయకట్టు వరకూ నీరందేలా పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చేపడుతున్న ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర అటవీ పర్యావరణశాఖ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శుక్రవారం హైదరాబాద్లో ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. చనా క- కొరట, ప్రాణహిత, నీల్వాయి, జగన్నాథ్పూర్, కుమ్రం భీం, కుప్టీ ప్రాజెక్టులు, చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్, ప్యాకేజీ 27, 28 సదర్మాట్ బ్యారేజీ, కడెం ప్రాజెక్టుల పనులు, చెక్డ్యాం ల నిర్మాణాలపై సమగ్రంగా చర్చించారు. ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులు, చెక్డ్యాంలు, లిఫ్టులు, కాల్వల నిర్మాణ పనులను అధికారులు వివరించారు. కొన్ని చోట్ల ఏజెన్సీలు ప నులు నిలిపివేశారని స్థానిక నాయకులు తెలియజేయగా, 60-సీ కింద టెండర్లు అప్పగించాలని మంత్రి అధికారులకు సూచించారు.
ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని, పెండింగ్ ప్రాజెక్టులపై పూర్తిస్థాయిలో చర్చించి సమగ్ర వివరాలను అందజేయాలని సూచించినట్లు తెలిపారు. చివరి ఆయకట్టు వరకూ నీరు అం దేలా నిర్మాణాలను పూర్తి చేయాలని, ఈ మేరకు పక్కా ప్ర ణాళికలు రూపొందించి ముందుకుసాగాలని సూచించారు. ఆదిలాబాద్, మంచిర్యాల, ముథోల్, ఖానాపూర్, బోథ్, బె ల్లంపల్లి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, దివాకర్రావు, విఠల్రెడ్డి, రాథోడ్ బాపురావు, దుర్గం చిన్నయ్య, ఆ త్రం సక్కు, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్కు మార్, జడ్పీ చైర్మన్, చైర్పర్సన్లు రాథో డ్ జనార్దన్, కోవ ల క్ష్మి, భాగ్యలక్ష్మి, విజయలక్ష్మి, డీసీసీబీ చైర్మన్ కాంబ్లే నాం దే వ్, సీఈలు శ్రీనివాస్రెడ్డి, రమేశ్, అధికారులు పాల్గొన్నారు.
నూతన లిఫ్ట్ ఇరిగేషన్, చెక్ డ్యాంలు మంజూరు చేయండి
భైంసా, మార్చి 26 : హైదరాబాద్లోని అరణ్య భవన్లో జరిగిన సమీక్షలో ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టుల గురించి ప్రస్తావించారు. పలుచోట్ల చెక్ డ్యామ్లు, నూతన లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేయాలని కోరారు. గుండెగావ్ ముంపు సమస్యను సత్వరమే పరిష్కరించాలని విన్నవించారు. గడ్డెన్న వాగు ప్రాజెక్టు ద్వారా మిషన్ భగీరథ పథకానికి నీరు అందించడం వల్ల ఏర్పడే సమస్య పరిష్కరించాలని, సీసీ కెనాల్ విస్తరణ చేపట్టాలని కోరారు. వీటిలో కొన్నింటికీ త్వరలో అనుమతిస్తామని ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్కుమార్ హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఈఎన్సీ మురళీధర్రావ్, చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్రెడ్డి ఉన్నారు.