మేడ్చల్, జూన్ 25(నమస్తే తెలంగాణ): ఇటీవల ఏసీబీకి రెడ్హ్యాండ్గా దొరికిన శామీర్పేట తహసీల్దార్ సుచరిత నివాసం, ఆమె బంధువుల ఇండ్లల్లో గురువారం అధికారులు తనిఖీలు చేపట్టారు. సుచరితపై అక్రమాస్తుల కేసును నమోదు చేసి హైదరాబాద్లోని హిమాయత్నగర్లో ఉన్న ఆమె నివాసంలో సోదాలు చేశారు.
సోదాల్లో రూ.5 కోట్ల అక్రమాస్తులను గుర్తించారు. సిద్దిపేట జిల్లా దామరకుంటలో 2 ఎకరాల వ్యవసాయం భూమి, రూ.38 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, రూ.12 లక్షల నగదు, హైదరాబాద్లో 3 ప్లాట్లు, కీసరలో 2 ప్లాట్ల ధ్రువపత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుచరిత ప్రసుత్తం జైల్లో ఉన్నారు.