హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ కవి, రివ్యూ రైటర్, యూనివర్సల్ పీస్ అంబాసిడర్, గ్లోబల్ హార్మోనీ అసోసియేషన్ వైస్చైర్మన్ డాక్టర్ అశోకచక్రవర్తి తోలానా ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. మోటివేషన్ స్ట్రిప్స్ రైటర్స్ ఫోరమ్ (సల్తనత్ ఆఫ్ ఒమన్), సీషెల్స్ ప్రభుత్వ సాంస్కృతికశాఖ సంయుక్తంగా అందించే రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరరీ హానర్-2022 అవార్డు ఆయనను వరించింది. భారతీయ గొప్ప కవి ఠాగూర్ 161వ జయంతి (మే 9)ని పురసరించుకొని జర్నల్ సైపే సహకారంతో ఏటా ఈ అవార్డును ప్రకటిస్తారు. 2022 సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా 240 మంది కవులకు ఈ అవార్డును ప్రకటించగా అందులో అశోక్ ఒకరు కావడం విశేషం. ఆయన కవితలు ప్రపంచవ్యాప్తంగా 90కి పైగా దేశాలలో వందలాది సాహిత్య పత్రికలు, సంకలనాలు, ఇ-జైన్ లు, పత్రికలు మొదలైనవాటిలో ప్రచురితమయ్యాయి.