హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): ఇరిగేషన్శాఖ ఓఅండ్ఎం(ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్) విభాగం ఈఎన్సీగా టీ శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈఎన్సీ అడ్మిన్గా ప్రస్తుత ఓఅండ్ఎం ఈఎన్సీ మధుసూదన్రావును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇరిగేషన్శాఖ సెక్రటరీ శ్రీధర్ ఆదివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. రెగ్యులర్ బదిలీల్లో భాగంగా వారి స్థానాలను పరస్పరం మార్చారు.