TSRTC | హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): గ్రామీణ, పట్టణ ప్రయాణికులకు ఆర్థికభారం తగ్గించేందుకు టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకొన్నది. పల్లె వెలుగు బస్సులో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం ‘టీ-9 టికెట్’ను అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్లోని బస్భవన్ లో శుక్రవారం ‘టీ-9 టికెట్’ పోస్టర్ను ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆవిషరించారు. అనంతరం మాట్లాడుతూ ఈ నెల 18 (ఆదివారం) నుంచి పల్లె వెలుగు బస్సుల్లో ఈ టికెట్స్ అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుందని, 60 కిలోమీటర్ల పరిధిలో ఒకసారి మాత్రమే అప్ అండ్ డౌన్ చేయొచ్చని వివరించారు. ఈ టికెట్ ధరను రూ.100గా నిర్ణయించినట్టు చెప్పారు. ఈ టికెట్ ద్వారా ఒక్కొక్కరికి రూ.20 నుంచి రూ.40 వరకు ఆదా అవుతుందని వెల్లడించారు.
60 ఏండ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు వయసు ధ్రువీకరణ కోసం తమ ఆధార్ కార్డును కండక్టర్లకు చూపించి, టీ-9 టికెట్ను పొందొచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) డాక్టర్ వీ రవీందర్, జాయింట్ డైరెక్టర్ సంగ్రామ్సింగ్పాటిల్, ఈడీ పీవీ మునిశేఖర్, పురుషోత్తం, కృష్ణకాంత్, సీటీఎం జీవన్ప్రసాద్, సీఎంఈ రఘునాథరావు, సీఈఐటీ రాజశేఖర్ , సీఎఫ్ఎం విజయపుష్ప తదితరులు పాల్గొన్నారు.