హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): విద్యార్థులకు ఆగస్టు మూడో వారం నుంచే ప్రస్తుత తరగతుల్లోని పాఠ్యాంశాలను బోధించనున్నట్టు రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణా సంస్థ (ఎస్సీఈఆర్టీ) వెల్లడించింది. జూలై 31 వరకు బ్రిడ్జి కోర్సును, ఆగస్టులో మొదటి రెండు వారాలు రెమిడియల్ టీచింగ్తో పాత పాఠ్యాంశాలను బోధించి, పరీక్షలను నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు 2021 -22 విద్యాసంవత్సరంలో ఎనిమిది వారాల ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలెండర్ను శుక్రవారం విడుదలచేసింది. వర్క్షీట్లను సైతం వెబ్సైట్లో పొందుపరిచింది. విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను తెలుసుకొనేందుకు 15 రోజులకొక పరీక్షను ఆన్లైన్లో నిర్వహించనున్నట్టు అకడమిక్ క్యాలెండర్లో ప్రకటించారు.