రాజన్న సిరిసిల్ల, మే 22 (నమస్తే తెలంగాణ) : ఈత సరదా ఇద్దరు ఇంటర్ విద్యార్థులను బలితీసుకున్నది. వివరాల్లోకి వెళితే.. సిరిసిల్లలోని శాంతినగర్కు చెందిన ఎదురుగట్ల హరిచరణ్గౌడ్ (17), వేములవాడ మండలం చీర్లవంచ ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన అల్లం మణికంఠ (17), ఆవుల శివకుమార్, పులి అభిలాష్, పులి సాయి చర ణ్, మంద అభిలాష్ శుక్రవారం స్విమ్మింగ్ కోసమని తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లె శివారు మానేరు వాగులోకి వెళ్లారు.
మొదటగా మణికంఠ, హరిచరణ్గౌడ్ నీటిగుంటలోకి దిగి గల్లంతయ్యారు. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచా రం ఇవ్వడంతో పోలీస్, అగ్నిమాపక శాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. నీటి లో మునిగిన మణికంఠ, హరిచరణ్గౌడ్ను వెలికి తీశారు. ఇరువురు అప్పటికే మృతి చెందడంతో బోరున విలపించారు.