హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పోలీసులకు మరో జాతీయ స్థాయి అవార్డు లభించింది. స్మార్ట్ పోలీసింగ్లో ఉత్తమ విధానాలు అమలు చేస్తున్నందుకు తెలంగాణ పోలీస్శాఖకు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) స్మార్ట్ పోలీసింగ్ అవార్డు-2021ను ప్రకటించింది.
తెలంగాణ పోలీస్శాఖ మహిళా భద్రత విభాగంలో షీ-టీమ్స్, భరోసా కేంద్రాలు, సైబర్ల్యాబ్లను ఏర్పాటు చేసి, ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నందుకు ఈ అవార్డును బహూకరించారు. శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో మహిళా భద్రత విభాగం అడిషనల్ డీజీ స్వాతిలక్రాకు ఫిక్కీ ప్రతినిధులు ఈ అవార్డును అందజేశారు.