స్వాతంత్య్ర ముహూర్తం ముంచుకొచ్చింది. పూర్తిగా గందరగోళం… ఇండియా, పాక్ విభజన వేళ ఆస్తులతోపాటు పుస్తకాలను అధికారులు ఆఘమేఘాల మీద పంచేశారు. పుస్తకాల విషయంలోనైతే ఇంగితజ్ఞానం లేకుండా వ్యవహరించారు. పంజాబ్ లైబ్రరీలో ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికాను ఏ నుంచి కే వరకు భారత్కు, మిగిలిన భాగాన్ని పాక్కు ఇచ్చారు. పై చిత్రంలో కనిపిస్తున్నది కలకత్తా నేషనల్ లైబ్రరీ. రెండు దేశాలకు చెందిన రచయితల పుస్తకాలున్నాయి. వాటిని రచయితలు ఎంచుకున్న దేశం ఆధారంగా పంచేశారు. భారతదేశ విభజన కేవలం రాష్ట్రాలు, ప్రజల విభజనే కాదు ఇది భావజాలంలోనూ మార్పు తెచ్చిందనే దానికి పై ఫొటో సాక్ష్యంగా నిలుస్తున్నది.