యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వయంభు ప్రధానాలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవం శుక్రవారం ఉదయం అర్చక స్వాములు ప్రారంభించారు. ప్రధానాలయ ప్రాకార కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్లను దివ్య అలంకరించి తూర్పు అభిముఖంగా వేంచేపు చేసి కల్యాణ తంతును జరిపారు. ఈ కల్యాణ వేడుకలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కల్యాణాన్ని వీక్షించారు. సాయంత్రం 6 గంటలకు లక్ష్మీ అమ్మవారి ఉంజల్ సేవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.