హుజూరాబాద్ రూరల్, మే 24: మద్యం తాగి పదో తరగతి పరీక్షల ఇన్విజిలేషన్ విధులు నిర్వహించిన ఓ ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు పడింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని రాంపూర్ ప్రభుత్వ పాఠశాలలో పీఈటీగా విధులు నిర్వహిస్తున్న రవికుమార్కు హుజూరాబాద్ బాలికల పాఠశాలలో పదో తరగతి పరీక్షలకు ఇన్విజిలేషన్ డ్యూటీ పడింది.
విధులకు మద్యంతాగి వచ్చాడన్న సమాచారంతో ఎస్సై చీనానాయక్ పరీక్ష కేంద్రం వద్దే బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేశారు. మద్యం తాగినట్టు నిర్ధారణ కావడంతో రవికుమార్ను సస్పెండ్ చేసినట్టు జిల్లా విద్యాదికారి జనర్దాన్రావు ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ అసియా, డిపార్టుమెంట్ అధికారి స్వామిరావును కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వ్యులు జారీ చేశారు.