జగిత్యాల, జూన్ 15: అధికారాలు, పంచాయతీ నిధులను దుర్వినియోగం చేసిన ఘటనలో జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం అబ్బాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పురంశెట్టి పద్మ, ఉప సర్పంచ్ ఎం నర్సయ్య, పంచాయతీ కార్యదర్శి మారుతిని ఆరు నెలలపాటు సస్పెండ్ చేస్తూ కలెక్టర్ జీ రవి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.
సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి.. తమ అధికారాలను, ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని కలెక్టర్ చెప్పారు. సర్పంచ్ రూ.1,60,115 నిధులకు సంబంధించి అవకతవకలకు పాల్పడటంతో ఆమెను సస్పెండ్ చేసినట్టు కలెక్టర్ వెల్లడించారు.