వనపర్తి, జనవరి 11 : వనపర్తి జిల్లా పెద్దమందడి జడ్పీహెచ్ఎస్లో తొమ్మిది మంది ఉపాధ్యాయులను కలెక్టర్ సస్పెండ్ చేశారు. గురువారం కలెక్టర్ పాఠశాలను తనిఖీ చేసిన సందర్భంలో 9మంది ఉపాధ్యాయులు గైర్హాజర్ కావడంతో హెచ్ఎం మంజులతను ప్రశ్నించారు.
ఎడ్యుకేషన్ ట్రిప్కు వెళ్లారని పేర్కొనడంతో ఉన్నతాధికారుల అనుమతి లేకుండా విద్యార్థులను ట్రిప్కు తీసుకెళ్లడంపై కలెక్టర్ తేజస్నందలాల్ పవార్ ఆగ్రహం వ్యక్తంచేస్తూ వారిని సస్పెండ్ చేశారు.