సూర్యాపేట టౌన్: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే నాయి బ్రాహ్మ ణులకు గుర్తింపు లభించిందని రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు రాసమల్ల బాలకృష్ణ పేర్కొన్నారు. సెలూన్లకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నందుకు మంగళవారం హైద్రాబాద్లో రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డిని రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంఘం కలసి కృతజ్ఞతలు తెలిపిం ది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి మేమంతా రుణపడి ఉంటామన్నారు.
నాయి బ్రాహ్మణులు నిర్వహిస్తున్న సెలూన్లకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయడం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన వరమని అభివర్ణించారు. ఇది బడుగుల ప్రభుత్వ మని చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా బడుగుల అభివృద్ధికి పని చేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్యాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు. మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపి సత్కరించిన వారిలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గడల రాజు, విద్యాసాగర్, మంచికంటి కరుణాకర్లతో పాటు సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జంపాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.