సూర్యాపేట(నమస్తే తెలంగాణ) : సూర్యాపేట ప్రాంతంలో రెండో తిరుపతిగా పేరొందిన జిల్లా కేంద్రంలోని అత్యంత పురాతన, ఆద్యాత్మిక కేంద్రంగా విరాజి ల్లుతున్న శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయానికి కొత్త సొబగులు రాబోతున్నాయి. భక్తుల సౌక ర్యార్థం భక్తులు, పండితుల ఆలోచనల మేరకు మంత్రి జగదీశ్రెడ్డి రూ.12 కోట్ల వ్యయంతో ఆలయ ఆధునికీకరణ, నూత న కట్టుబడి చేపట్టేందుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే వేంకటేశ్వరస్వామి, అలివేలు మంగమ్మ, గోదాదేవి ఆలయాలతో పాటు నాలుగు గోపురాలు, యాగశాల, పుష్కరిణి, కేశ ఖండనశాల తదితరాలతో దాదాపు ఆలయ పునఃనిర్మాణానికి సంబంధించిన మ్యాప్ సిద్ధం అయినట్లు తెలుస్తుంది. కాగా నేడు ఆలయ గర్బగుడి నిర్మాణం కోసం చేపట్టే భూమి పూజ కార్యక్రమానికి శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్స్వామి హాజరు కానున్నారు.
కొద్ది సంవత్సరాలుగా సూర్యాపేటకు రాకుండా ఈ మధ్య కాలంలో వస్తున్న వారు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి ఆశ్చర్య చకితులవుతున్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం సూర్యాపేట నుంచి తొలి, మలి ఎన్నికల్లో శాసన సభ్యుడిగా గెలుపొందిన గుంటకండ్ల జగదీశ్రెడ్డి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ అన్ని రంగాలను అభివృద్ధి చేస్తున్నారు. మినీ ట్యాంక్బండ్లు, మోడల్ మార్కెట్, కలెక్టరేట్, పట్టణంలో దాదాపు 55కు పైనే పార్కులు, పార్కులను తలపించే రీతి న వైకుంవఠధామాల అభివృద్ధి, ఎక్కడ చూసినా పచ్చదనం ఉట్టిపడేలా మొక్కల పెంపకం, మెడికల్ కళాశాల ఇలా మొ త్తం మీద సూర్యాపేట నలుదిక్కులా అభివృద్ధి చెందుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా సూర్యాపేట పట్టణంలోని అతి పురా తన, సుప్రసిద్ధమైన వేంకటేశ్వరస్వామి దేవాలయానికి కొత్త హంగులు కల్పించాలని భక్తుల నుంచి వస్తున్న కోరిక మేరకు మంత్రి చర్యలు చేపడుతున్నారు.
వె య్యేళ్లయినా చెక్కు చెదరకుండా ఉండేలా
రూ.12 కోట్ల వ్యయంతో దేవాలయ పునఃర్నిర్మాణం చేపట్టాలని అనుకుంటున్నప్పటికీ అంతకన్నా ఎక్కువ నిధులు అవ సరమున్నా తీసుకువచ్చి రాబోయే వెయ్యేండ్లకు అయినా చెక్కు చెదరకుండా ఉండేలా ఆలయాన్ని నిర్మించాలనే స్థిర నిశ్చయంతో మంత్రి జగదీశ్ రెడ్డి ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే ఆలయ నిర్మాణం విషయమై ఈ నెలలోనే చిన జీయర్స్వామిని కలిసి చర్చించడం, ఆ మరుసటి రోజే ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద్సాయి, స్థపతి వల్లియనాగన్తో కలిసి ఆలయనాన్ని పరిశీలించిన విషయం విధితమే.
నలు దిక్కులా నాలుగు గోపురాలు
ఆలయానికి మూడు వైపులా అంటే పడమర, ఉత్తర, దక్షణ వైపులో మూడంతస్తుల రాజగోపురాలతో పాటు తూర్పున ప్రధాన గోపురం ఏడంతస్తులు ఉండేలా ప్లాన్ తయారు చేస్తున్నట్లు తెలిసింది. వేంకటేశ్వరస్వామి వారికి ప్రధాన ఆలయ నిర్మాణంతో పాటు అలివేలు మంగమ్మ, గోదాదేవి ఆలయాలు నిర్మించనున్నారు. అలాగే సంకట మోచన ఆంజనేయ స్వామి, సుదర్శన నృసింహస్వామి ఆలయాలు నిర్మించనుండగా యాగశాల, పాకశాల, పుష్కరిణీ, కేశ ఖండన మండ పం అలాగే మాడవీధులు, ధ్వజ స్థంభం, పూజారులకు గదులు, ఈఓ పాలక మండలి కార్యాలయాలు, కళ్యాణ మంట పం, అన్నదాన సత్రం, స్వామి వారి వాహనశాలతో పాటు స్థలం అందుబాటులో ఉండే దానిని బట్టి భక్తులకు విశ్రాంతి గదులు నిర్మించనున్నారు.
నేడు మధ్యాహ్నం 3 గంటలకు భూమిపూజ
కాగా దేవాలయ ఆదునీకీకరణ, పునఃర్నిర్మాణ పనులకు నేడు మధ్యాహ్నం 3 గంటలకు భూమి పూజ నిర్వహించను న్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారు హాజరుకానున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ కార్యక్రమానికి పట్టణంలోని వివిధ సంఘాల సభ్యులు, వ్యాపార వర్గాలు, ఉద్యోగులు, డాక్టర్లు, అన్ని క్లబ్ల సభ్యులు, న్యాయవాదులు, పురప్రముఖులు, భక్తులు హాజరు కావాల్సిందిగా దేవాలయ భక్త బృందం కోరుతుంది.