సూర్యాపేట టౌన్: పోరాడి సాధించుకున్న తెలంగాణలో అన్ని రంగాల ప్రజలకు నిరంతరం అభివృద్ధితో పాటు పరిపాలన ను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ సంచలనాత్మకంగా ప్రసాదించిన సూర్యాపేట జిల్లాలో అన్ని రంగాల అభివృద్ధికై నిధులకు ఏమాత్రం వెనుకాడమని.. నాణ్యతలో రాజీ పడేది లేదని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని గ్రేడ్ 1 గ్రంథాలయ భవనం విస్తరణకై స్థల పరిశీలన చేసి మాట్లాడారు. గత ఉ మ్మడి పాలనలో ఏమాత్రం అభివృద్ధికి నోచుకోని గ్రంథాలయాలు నేడు నూతన శోభను సంతరించుకుంటున్నాయన్నారు.
పాఠకులకు, నిరుద్యోగులకు అవసరమైన విజ్ఞానాన్ని అందించడంలో గ్రంథాలయాలు ఎంతగానో దోహద పడుతున్నాయ న్నారు. అటువంటి గ్రంథాలయాలు పాఠకులకు అన్ని సౌకర్యాలతో అణువుగా ఉండేందుకు భవనాలు విశాలంగా ఉంచా లనే లక్ష్యంతో విస్తరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఉద్యమాలకు కేంద్రంగా పేరుగాంచడంతో పాటు వందేళ్ల చరిత్ర కలిగిన సూర్యాపేట గ్రంథాలయం పాఠకులకు అణువుగా మరింత విస్తరించడం జరుగుతుందన్నారు. త్వరలోనే గ్రంథాల య విస్తరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
ప్రజలందరికీ అవసరమైన అన్నీ సేవలు అందుబాటులో ఉంచాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని.. ఆ దిశగానే రాష్ట్రంలో సంచలనాత్మకంగా నూతన జిల్లాల ఏర్పాటు జరిగిందన్నారు. గత ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యానికి అరవై ఏండ్లు ఎన్నో అవస్థలు పడ్డామని.. ఉద్యమ సమయంలోనే అందరి కష్టాలు తెలుసుకుని రాష్టాన్ని సాధించి అందరి కలలను సాకారం చేస్తున్నామన్నారు. గత ఏడేండ్లుగా నిరంతరం అభివృద్ధి పాలనతో పాటు వినూత్న పథకాలతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతూ.. అన్ని రంగాల ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నారన్నారు.
అంతేకాకుండా ప్రజలకు పరిపాలన మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో సూర్యాపేట జిల్లాగా అవతరించిన తరువాత జిల్లా కార్యాలయాలు తాత్కాలిక భవనాలలో కొనసాగుతున్నాయన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం, విద్యార్థులకు వైద్య విద్య ను మరింత చేరువ చేసేందుకు పేటలో సీఎం కేసీఆర్ సంచలనాత్మకంగా మెడికల్ కళాశాలను ప్రసాదించారన్నారు. అలా గే మెడికల్ కళాశాలతో పాటు ప్రజలందరికీ అవసరమైన అన్నిశాఖలు ఒకేచోట అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో సమీ కృత కలెక్టరేట్ను ఏర్పాటు చేశారని వాటితో పాటు ఎస్పీ కార్యాలయాలకు పక్కా భవనాలు నిర్మించుకుంటున్నామన్నారు
అలాగే రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో రెండు మినీ ట్యాంక్ బండ్లు, పార్క్ల సుందరీకరణ, వైకుంఠధామాలను సైతం పార్క్లను తలపించేలా నిర్మిస్తుండటంతో పాటు రోడ్ల విస్తరణ పనులు ఇలా సకల సౌకర్యాలతో ఎవరూ ఊహించని అభివృద్ధితో పేట రూపు రేఖలు మార్చుకుని మరింత సుందరంగా తీర్చిదిద్దుకుందామన్నారు.
కార్యక్రమంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ మోహన్ రావు, ఆర్డీ వో రాజేంద్ర కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, కుంబం రాజేందర్, గుండపునేని కిరణ్, రమాకిరణ్, రఫీ, చరణ్, పాండురంగ తదితరులు పాల్గొన్నారు.