ఖమ్మం, జూలై 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాదరెడ్డి ఆధీనంలో ఉన్న ఎన్ఎస్పీ భూముల్లో సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం నిర్వహించనున్న సర్వేకు హాజరుకావాలని పొంగులేటి ప్రసాదరెడ్డికి రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు సంయుక్తంగా నోటీసులు జారీ చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు సంయుక్తంగా సర్వేచేసి ఎస్ఆర్ గార్డెన్స్లో ఉన్న 22 గుంటల ఎన్ఎస్పీ భూమికి హద్దులు నిర్ధారించనున్నట్టు ఇరిగేషన్ ఈఈ అనన్య తెలిపారు.