హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): ఫైబర్నెట్ కేసులో ముందస్తు బెయిల్కు పిటిషన్ వేసిన చంద్రబాబుకు మరోసారి నిరాశే ఎదురైంది. బెయిల్ పిటిషన్పై విచారణను వచ్చే నెల 8కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
ముందుగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో తీర్పు వెలువరిస్తామని, అనంతరం ఫైబర్నెట్ కేసు పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టంచేసింది. అప్పటివరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దని, పీటీ వారెంట్పై యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది.