హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి దాఖలైన వివిధ పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఆయా సమస్యలపై అవసరమైతే సీఎంలు, సీఎస్ల స్థాయిలో చర్చలు జరపాలని ధర్మసనం వ్యాఖ్యానించింది. నిర్మాణంలో పర్యావరణ అనుమతులు పాటించలేదంటూ తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
తమ రాష్ర్టాల్లో ముంపు సమస్యలు ఉన్నాయని కొందరు వ్యక్తులు, సంస్థలు కలిసి పిటిషన్లు వేశారు. పర్యావరణ అనుమతులు, ప్రాజెక్టు నిర్మాణానికి పొంతన లేదని ఫిర్యాదు చేశారు. పర్యావరణ అనుమతులపై పునఃసమీక్ష చేయాలని సుప్రీంకోర్టును కోరారు. అన్ని పిటిషన్లు కలిపి త్రిసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. వాస్తవాలతో కూడిన నివేదిక ఇవ్వాలని కేంద్ర జల్శక్తి శాఖకు ఆదేశాలిచ్చింది. కేసు విచారణలో అదనపు పత్రాలు సమర్పించేందుకు రాష్ర్టాలు అనుమతి కోరగా, అందుకు ధర్మాసనం అంగీకరించింది. కేసు విచారణ డిసెంబరు 7కి వాయిదా వేసింది.