Suprabhata Seva | తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 15 నుంచి సుప్రభాత సేవ పునః ప్రారంభం కానున్నది. ధనుర్మాసం ఆదివారంతో ముగియనున్నది. గత ఏడాది డిసెంబర్ 17న తెల్లవారుజామున 12.34 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభయ్యాయి. దీంతో శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం నిర్వహిస్తూ వచ్చారు. ఈ నెల 14న ధనుర్మాస ఘడియలు పూర్తి కానున్నాయి. దీంతో యథాప్రకారం 15 నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ ప్రారంభించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఈ విషయాన్ని గమనించాలని కోరింది. ఇదిలా ఉండగా.. ఈ నెల 16న ఆలయంలో ఉదయం శ్రీవారి ఆలయంలో గోదా పరిణయోత్సవం, మధ్యాహ్నం పార్వేటమండపం వద్ద పార్వేట ఉత్సవం నిర్వహించనున్నట్లు అధికారులు వివరించారు.