హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. రంజాన్ను పురసరించుకొని మహిళా కమిషన్ సభ్యురాలు షాహిన్ అఫ్రోజ్ నివాసంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందుకు ఆమె హాజరై మాట్లాడారు. మైనార్టీలకు గుర్తింపునిచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దకుతున్నదని పేర్కొన్నారు. ఇఫ్తార్ విందు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నదని చెప్పారు. అనంతరం అనాథ పిల్లలు, పేద ముస్లింలకు దుస్తులు, రేషన్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో కమిషన్ సెక్రటరి కృష్ణకుమారి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.