నిజాంసాగర్, డిసెంబర్ 24: బీఆర్ఎస్కు కర్ణాటకలోనూ మద్దతు పెరుగుతున్నది. అక్కడ పార్టీ విస్తరణ, బలోపేతంపై చర్చించేందుకు ఎమ్మెల్యే హన్మంత్ షిండే, కర్ణాటకలోని ఔరాద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గుండప్ప వకీల్ను శనివారం ఔరాద్లో కలిశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్కు వకీల్ తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కర్ణాటకలో బీఆర్ఎస్ విస్తరణ, పార్టీలో చేరికల గురించి ఇరువురు చర్చించుకున్నారు. అనంతరం వకీల్ మాట్లాడుతూ.. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు చాలా బాగున్నాయని, ఏ రాష్ట్రంలో లేనన్ని పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, అందుకే బీఆర్ఎస్కు కర్ణాటకలోనూ మద్దతు ఉంటుందని తెలిపారు. సమావేశంలో మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయాగౌడ్, జుక్కల్ ఎంపీపీ నీలూ పటేల్, మాజీ ఎంపీపీ బస్వంత్రావ్ షెట్కార్ పాల్గొన్నారు.