బాన్సువాడ, అక్టోబర్ 7: బాన్సువాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి రోజురోజుకు మద్ద తు పెరుగుతున్నది. వచ్చే ఎన్నికల్లో కారు గు ర్తుకు ఓటు వేస్తామని పలు సంఘాలు స్వ చ్ఛందంగా తీర్మానం చేశాయి. తాడ్కోల్ పీఎస్ఆర్ బీడీ వర్కర్స్ కాలనీ సంఘం, నస్రుల్లాబాద్ మండలం మిర్జాపూర్ మాల సంఘ సభ్యులు శనివారం స్పీకర్ను బాన్సువాడలో కలిసి తీర్మాన పత్రాలను అందజేశారు. బా న్సువాడ అభ్యర్థిగా పోచారం శ్రీనివాసరెడ్డిని ప్రకటించిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. బాన్సువాడ మండలం తిర్మలాపూర్కు చెందిన బోయి కులస్థులు కూడా స్పీకర్కు మద్దతు ప్రకటించారు. గ్రామంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన సభాపతికి తీర్మాన ప్రతులను అందజేశారు.