గంగాధర, జనవరి 9: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై(KTR) తప్పుడు కేసులు పెట్టి.. అక్రమంగా అరెస్ట్ చేయాలని చూస్తే రాష్ట్రం అగ్ని గుండంగా మారుతుందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ (Sunke Ravi Shankar )హెచ్చరించారు. గురువారం ఆయన కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాలలోని శుభమస్తు ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఫార్ములా-ఈ రేసులో ఎలాంటి అవినీతికి తావులేకున్నా ప్రభుత్వం అక్రమ కేసులతో వేధింపులకు గురి చేస్తోందని విమర్శించారు.
కేవలం ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్నికల హామీలపై మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు ప్రశ్నిస్తున్నందున వారిపై అక్రమంగా కేసులు పెడుతోందని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి దేశానికే రోల్మోడల్గా నిలువగా, రేవంత్రెడ్డి పాలనలో అధోగతి పాలవుతోందన్నారు. చొప్పదండి నియోజకవర్గానికి వరప్రదాయినిగా ఉన్న నారాయణపూర్ రిజర్వాయర్ను ఎల్లంపల్లి జలాలతో నింపి పంటలకు సాగు నీరు అందించాలని డిమాండ్ చేశారు.
నారాయణపూర్ రిజర్వాయర్ కింద నియోజకవర్గంలో దాదాపు 70ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. నాలుగు రోజుల్లో రిజర్వాయర్కు నీటిని విడుదల చేకుంటే రైతులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గంగాధర సింగిల్విండో చైర్మన్ దూలం బాలగౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్ సాగి మహిపాల్రావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్రావు, మాజీ సర్పంచులు కంకణాల విజేందర్రెడ్డి, ఎండీ నజీర్, వేముల దామోదర్, ముక్కెర మల్లేశం, జోగు లక్ష్మీరాజం, రామిడి సురేందర్, వడ్లూరి ఆదిమల్లు, పొట్టల కనకయ్య, నాయకులు పాల్గొన్నారు.