నల్లగొండ : నల్లగొండ మండలం ముషంపల్లి గ్రామాన్ని రాష్ట్ర మహిళ కమిషన్ చైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి సందర్శించారు. హత్యకు గురైన ధనలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఘటన పూర్వపరాలను, నిందితుల వ్యవహారశైలిపై అరా తీశారు. కుటుంబానికి మహిళ కమిషన్ అండగా ఉంటుందని వారికి ధైర్యం చెప్పారు.
ఘటన చాలా దురదృష్టకరమని, నిందితులు ఎంతటి వారైనా కఠిన శిక్ష తప్పదని చెప్పారు. సీఎం కేసీఆర్ కూడా జరిగిన ఘటనపై చాలా సీరియస్గా ఉన్నారన్నారు. నిందితులపై అన్ని సాక్ష్యాధారాలు సేకరించి చార్జిషీట్ దాఖలు చేయాలని ఈ సందర్భంగా ఎస్పీ రంగనాధ్ ను ఆదేశించారు. గ్రామంలో బెల్టు షాపులపైన చర్యలు చేపట్టేలా చూస్తామని గ్రామస్థులకు హామీ ఇచ్చారు.
ప్రభుత్వం నుంచి ఏదైనా ఆర్థికసాయం వచ్చేటట్లు చూస్తామని, ధైర్యంగా ఉండాలని బాధిత కుటుంబసభ్యులకు సూచించారు. అంతకు ముందు నల్లగొండలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డితో కలిసి ఎస్పీ రంగనాధ్, జేసీ చంద్రశేఖర్, ఇతర అధికారులతో ఘటనపై సమీక్షించారు. కేసును త్వరగా విచారణ పూర్తి చేసి కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసులను ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..
Crime News | ధనలక్ష్మిపై లైంగిక దాడి కేసులో నిందితుల అరెస్టు
ముషంపల్లి ఘటన అమానుషం : మంత్రి జగదీష్ రెడ్డి
పెగాసిస్ వ్యవహారంపై విచారణకు టెక్నికల్ కమిటీ: సుప్రీంకోర్టు
Air Pollution | ప్రతి ఏటా 70 లక్షల మందిని చంపుతున్న వాయు కాలుష్యం: డబ్ల్యూహెచ్వో