నల్లగొండ : నల్లగొండ మండలం ముషంపల్లి గ్రామంలో బుధవారం ధనలక్ష్మి అనే మహిళపై లైంగిక దాడి, హత్య కేసులో నిందితులను 24 గంటల్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై ఇప్పటికే జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి వెంటనే స్పందించారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు.
నల్లగొండ దవాఖాన మార్చరీ వద్ద ధనలక్ష్మి మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇక ఈ కేసు విషయంలో ఘటన జరిగిన వెంటనే నిందితులను గుర్తించిన పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి రిమండ్ కు తరలించారు. ఈ కేసులో అదే గ్రామానికి చెందిన బక్కతట్ల లింగయ్య, ఎంపుజర్ల శంకర్ అలియాస్ పుల్లయ్యల అరెస్ట్ విషయాన్ని డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.
వీరిద్దరికి గతంలోనే నేర చరిత్ర ఉందని, మద్యం మత్తులో ఈ అఘాయిత్యానికి పాలడినట్లు తెలిపారు. లైంగిక దాడికి యత్నించగా ప్రతిఘటించడంతో తలను నెలకు బలంగా కొట్టారు. దీనితో పాటు ముక్కు, నోరు మూసి ఉపిరి ఆడకుండా చేశారు.
ఇవి కూడా చదవండి..
ముషంపల్లి ఘటన అమానుషం : మంత్రి జగదీష్ రెడ్డి
పెగాసిస్ వ్యవహారంపై విచారణకు టెక్నికల్ కమిటీ: సుప్రీంకోర్టు
Air Pollution | ప్రతి ఏటా 70 లక్షల మందిని చంపుతున్న వాయు కాలుష్యం: డబ్ల్యూహెచ్వో