హైదరాబాద్ : కాంగ్రెస్( Congress) పార్టీ తీరు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా మారింది. సీఎం నేనంటే నేనే అని ఓ వైపు సీనియర్లు లాబీయింగ్ చేస్తుంటే, మరోవైపు నాయుకుల తీరుతో పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తి పెల్లుబికుతున్నది. తెలంగాణలో ముఖ్యమంత్రిని ప్రకటించడంలో జాప్యం జరుగుతుండటంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్(Ella Hotel) గేటు దగ్గర ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కొంతమంది యువకులు ‘రేవంత్ రెడ్డి సీఎం’ అంటూ నినాదాలు చేశారు.
అదే సమయంలో కొందరు తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం(Suicide attempt) చేయడం కలకలం రేపింది. వెంటనే అలర్టయిన పోలీసులు ఆందోళన చేస్తున్న వారందరిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. మరోవైపు తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో ఎలాంటి గందరగోళం లేదని పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ రెడ్డి మీడియాతో చెప్పారు. మెజారిటీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికే ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వాలని ఏఐసీసీ పరిశీలకుల వద్ద చెప్పినట్లు ఆయన తెలిపారు.