CII | హైదరబాద్ : తెలంగాణ( Telangana ) సాధిస్తున్న సమ్మిళిత వృద్ధి వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని భారత్ బయోటెక్( Bharat Biotech ) జాయింట్ ఎండీ సుచిత్ర ఎల్ల( Suchitra Ella )తెలిపారు. బేగంపేటలో ఏర్పాటు చేసిన సీఐఐ( CII ) తెలంగాణ వార్షిక సమావేశంలో సుచిత్ర ఎల్ల పాల్గొని ప్రసంగించారు.
రాష్ట్రానికి పెట్టుబడుల కోసం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) కృషి చేస్తున్నారు అని ప్రశంసించారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం కూడా బాగుందని కొనిడియారు. టీఎస్ ఐపాఎస్( TS IPASS ) ద్వారా సెల్ఫ్ సర్టిఫికేషన్ విధానం బాగుందన్నారు. ఆవిష్కరణలను ప్రోత్సహించే టీ హబ్( T Hub ) ఏర్పాటు చేయడం మంచి ఆలోచన అని పేర్కొన్నారు. పునరుత్పాదక శక్తి రంగంలో పరిశ్రమలను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. విదేశీ కంపెనీల పెట్టుబడులకు దక్షిణాది రాష్ట్రాలు గమ్యస్థానంగా మారాయని సుచిత్ర ఎల్ల స్పష్టం చేశారు.