హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినట్టు రాష్ట్ర వైద్యారోగ్య, కుటుం బ సంక్షేమశాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 40,77,474 మంది 0-5 ఏండ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.40,57,320 మంది కి చుక్కలు వేయడం లక్ష్యంగా కార్యక్రమం చేపట్టారు. బూత్ల ఏర్పాటుతోపాటు ఇంటింటికీ కార్యకర్తలు వెళ్లారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. లక్ష్యానికి మించి 40,77,477 మందికి 100.5 శాతం పోలియో చుక్కలు వేశారు.
వలస కూలీల కాలనీలు, హైరి స్క్ ఏరియాల్లో 76,058 మందికి, ప్రభావిత ప్రాంతాల్లో 1,44,857 మంది చిన్నారులకు వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నాలుగు రోజులపాటు నిర్వహించిన పోలియో కార్యక్రమంలో తొలిరోజు అత్యధికంగా 37,53,814 మందికి, రెండోరోజు 1,05,729 మందికి, మూడోరోజు 1,70,020 మందికి, చివరిరోజు 47,914 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్టు రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వెల్లడించారు.