హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం జీవో 317, జీవో 46పై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం గురువారం ఉద్యోగ సంఘాలతో భేటీ కానున్నది. మంత్రి దామోదర్ రాజనర్సింహా అధ్యక్షతన మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్తో కూడిన ఈ కమిటీ సచివాలయంలో ఉద్యోగ సంఘాల నుంచి విజ్ఞప్తులను స్వీకరించనున్నది. జీవోలు 317, 46 వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదురొంటున్న సమస్యలను కమిటీకి వివరించాలని మంగళవారం జరిగిన భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు విజ్ఞప్తులు స్వీకరించడంతోపాటు గ్రీవెన్స్ సెల్ను ఏర్పాటు చేయనున్నారు.