పీర్జాదిగూడ, డిసెంబర్ 7: రాచకొండ పరిధిలోని మేడిపల్లి పోలీస్స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న యాదగిరిరాజును మంగళవారం లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. బైక్ యాక్సిడెంట్ కేసులో గాయపడిన ఆర్టీసీ ఉద్యోగి ఎన్ శ్రీనివాస్కు న్యాయం చేసేందుకు అతని కుమారుడు ప్రశాంత్ దగ్గర రూ.20 వేలు ఎస్సై డిమాండ్ చేసి వేధించాడు. చివరకు పదివేలకు బేరం కుదిరింది. ఈలోగా ప్రశాంత్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళరం అతడు ఎస్సైకి ససొమ్మమ్ము ఇస్తస్తుండగగా వలపన్ని రెడ్హ్యాండెండ్గా పట్టుకున్నారు. రూ.10 వేలు స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. ఈ దాడిలో డీఎస్పీ శ్రీకాంత్, ఎస్సైలతో పాటు సిబ్బంది
పాల్గొన్నారు.