హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్ విద్యావిధానంపై అధ్యయననానికి తెలంగాణ విద్యావేత్తల బృందం ఆదివారం ఆస్ట్రేలియాకు బయలుదేరింది. గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఆహ్వానం మేరకు గ్లోబల్ ఎడ్యుకేషన్ కెరీర్ ఫోరం భాగస్వామ్యంతో రాష్ర్టానికి చెందిన నలుగురు ఇంజినీరింగ్ కాలేజీల ప్రిన్సిపాళ్లు వారం రోజల పాటు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు.
ఈ బృందంలో ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ పూర్వ ప్రిన్సిపాల్ శ్రీరామ్ వెంకటేశ్తో పాటు ఎంజీఐటీ, వీఎన్నార్ విజ్ఞానజ్యోతి, గోకరాజు రంగరాజు ఇంజినీరింగ్ కాలేజీల ప్రిన్సిపాళ్లు ఉన్నారు.