హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ) : ఐఐటీల్లో ప్రవేశాలు పొందాలనుకొనే విద్యార్థులు ఈ ఏడాది కాస్త శ్రమించాల్సిందే. ఎందుకంటే, జేఈఈ అడ్వాన్స్డ్ సిలబస్లో మార్పులేకపోవడమే కారణంగా చెప్పవచ్చు. అయితే, జేఈఈ మెయిన్ సిలబస్ మాత్రం కాస్త కుదించారు. ఇటీవలే జేఈఈ అడ్వాన్స్డ్ షెడ్యూల్ను, సిలబస్ను ఐఐటీ మద్రాస్ విడుదల చేసింది. నిరుడు జేఈఈ అడ్వాన్స్డ్ సిలబస్నే ఈ ఏడాది కొనసాగిస్తుండగా, మెయిన్ సిలబస్ను కాస్త కుదించారు.
ఒక్క ఫిజిక్స్లోనే 14 అంశాలను తొలగించారు. ఇవేకాకుండా కెమిస్ట్రీ, గణితం సబ్జెక్టుల్లోనూ పలు పాఠ్యాంశాలకు కోత విధించారు. న్యూటన్ ల ఆ ఆఫ్ కూలింగ్, కార్టన్ ఇంజిన్ అండ్ ఎఫిషియన్సీ, డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ సౌండ్స్, ఫోర్స్డ్ అండ్ డంప్డ్ ఆస్కిలేషన్ తదితర పాఠ్యాంశాలున్నాయి. కెమిస్ట్రీలో 25శాతం సిలబస్, గణితంలో రెండు పాఠ్యాంశాలను తొలగించారు. అయితే కుదించిన సిలబస్ను అడ్వాన్స్డ్లో అలాగే కొనసాగించారు. దీంతో ఐఐటీల్లో చేరాలన్న బలమైన కోరిక ఉన్నవారు అడ్వాన్స్డ్కు ప్రిపేరవడంలో భాగంగా ఆయా సబ్జెక్టులను చదవాల్సి ఉంటుంది.