హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : విద్యార్థులు ధారాళంగా చదవడం. పఠన నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు విద్యాశాఖ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పఠనోత్సవానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తల బృందం ఫిదా అయ్యింది. విద్యార్థులు ఆనర్గళంగా చదవడాన్ని పరిశీలించిన బృందం ప్రశంసలు కురిపించింది. ఇస్రో అనుబంధ విభాగం అడ్వాన్స్డ్ డాటా ప్రాసెసింగ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ సీనియర్ శాస్త్రవేత్త ప్రశాంత్ అంగారక్లతో కూడిన ప్రతినిధి బృందం సోమవారం హైదరాబాద్ జిల్లా తిరుమలగిరిలోని ప్రభుత్వ బడిని సందర్శించింది.
పాఠశాలలో రీడింగ్ క్యాంపెయిన్ గురించి ప్రతినిధి బృందం ఆరా తీసింది. పఠన నైపుణ్యాలను పెంపొందించేందుకు జూన్ 26 నుంచి పఠనోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టుగా టీచర్లు ఆ బృందానికి వివరించారు. ‘ఒక చేతితో కాకుండా రెండు చేతులతో పుస్తకాలను చదవాలని.. మనం పుస్తకాన్ని గౌరవిస్తే పుస్తకం మనల్ని గౌరవిస్తుందని ఈ వారు విద్యార్థులకు సందేశం ఇచ్చారు.