హనుమకొండ చౌరస్తా, మే 23 : కాకతీయ విశ్వవిద్యాలయంలో మెస్లను మూసివేస్తామని హాస్టల్ డైరెక్టర్ సర్యూలర్ జారీ చేయడాన్ని నిరసిస్తూ పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు యూనివర్సిటీ పరిపాలన భవనం ఎదుట వంటసామగ్రితో ఆందోళన చేపట్టారు. ప్లేట్లతో రిజిస్ట్రార్కు వ్యతిరేకంగా నినాదాలు చేసి దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా కాకతీయ యూనివర్సిటీ పీడీఎస్యూ కార్యదర్శి మర్రి మహేశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో త్వరలో గ్రూప్స్, డీఎస్సీతోపాటు వివిధ రకాల పరీక్షలు నిర్వహించనున్నారని, ఈ సమయంలో మెస్ను ముసివేయడం తగదని అన్నారు. సర్క్యూలర్ను వెంటనే వెనకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా హాస్టళ్ల డైరెక్టర్ సమ్మయ్య స్పందిస్తూ హాస్టళ్లను యథావిధిగా నడిపిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.